తెలంగాణలో త్వరలోనే గులాబీ జెండా పని ఖతం: MP బండి సంజయ్

by Disha Web Desk 19 |
తెలంగాణలో త్వరలోనే గులాబీ జెండా పని ఖతం: MP బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఖమ్మంలో ఇవాళ నిరుద్యోగ నిరసన మార్చ్ చేపట్టింది. టీ- బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి మయూరి సెంటర్ వరకు బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రసంగించిన బండి సంజయ్ కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందన్నారు. ఇక తెలంగాణలో ఎర్రజెండా వెలిసిపోయింది.. కాంగ్రెస్ పని ఖతమైపోయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే గులాబీ జెండా ఖతం అవుతోందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అధికార మదంతో గుండాగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే గుండాగిరీ చేసే వాళ్ల సంగతి చూస్తామని బండి ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు.

Also Read..

కేసీఆర్ వందల సార్లు తల నరుక్కోవాలి: సీఎంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

వాళ్లు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు


Next Story