మల్కాజిగిరిలో రెండో రోజు ఆరు నామినేషన్‌లు

by Disha Web Desk 23 |
మల్కాజిగిరిలో రెండో రోజు ఆరు నామినేషన్‌లు
X

దిశ,మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి రెండో రోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఐదుగురు స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి గౌతమ్ పోట్రు ఓ ప్రటకనలో తెలిపారు. ఓరుగంటి వెంకటేశ్వర్లు, పెండ్యాల సాయి వరప్రసాద్ , రాజేష్ మిశ్రా శివ్, చలిక చంద్ర శేఖర్ లు ఒక్కొక్క సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, కుడుపూడి వి వి ఎస్ నారాయణ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలియజేశారు. కాగా తొలి రోజు 8 మంది నామినేషన్ల దాఖలే చేయగా, వీరిలో ఒకరు రెండు సెట్ల నామినేషన్లు వేశారు.దీంతో రెండు రోజుల్లో 15 నామినేషన్లు దాఖలయ్యాయి.

Next Story

Most Viewed