గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వకుండా గుడ్డి,కుంటి గుర్రాలకు టికెట్ ఇస్తారా : మాజీ కేంద్ర మంత్రి

by Disha Web Desk 23 |
గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వకుండా గుడ్డి,కుంటి గుర్రాలకు టికెట్ ఇస్తారా : మాజీ కేంద్ర మంత్రి
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : కంటోన్మెంట్ లో మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కి టికెట్ ఎలా ఇస్తారు? సర్వే లేడా? గెలిచే వ్యక్తులు లేరా ? అని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. సర్వే సత్యనారాయణ నామినేషన్ వేసే ముందు మీడియాతో సర్వే తన నివాసంలో మాట్లాడారు. గెలిచే గుర్రాల కు టికెట్ ఇవ్వకుండా గుడ్డి,కుంటి గుర్రాలకు టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కంటోన్మెంట్ లో మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి శ్రీ గణేష్ కి టికెట్ ఎలా ఇస్తారు..? ఇక్కడ సర్వే లేడా..? ఇంకా గెలిచే వ్యక్తులు లేరా ..? అని ప్రశ్నించారు. రెండు సార్లు ఓడి పోయిన వ్యక్తి ని ఎలా తెస్తావు... కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పై పోలీస్ కేసులు,క్రిమినల్ కేసులు అభ్యర్థి పై మళ్లీ మాట్లాడుతా అన్నారు. రేవంత్ రెడ్డి కి అనుభవం లేదా?...లేక ఎవరైనా చెప్పుడు మాటలు వింటున్నాడా? అని ఫైర్ అయ్యారు. మాదిగ ల ను విస్మరించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాంగ్రెస్ ఇది కాదని '...తెలుగుదేశం కాంగ్రెస్ అయిందని ఆగ్రహం సర్వే వ్యక్తం చేశారు . నామినేషన్ వేస్తున్న..నాకు ఎమ్మెల్యే టికెట్ ,ఎంపీ టికెట్ ఏదో ఒకటి ఇస్తారని ఆశిస్తున్నా.. ఇవ్వకుంటే నా సత్తా చూపిస్తా...ఎందుకు నాకు టికెట్ ఇవ్వవ్వు.. నాకేం తక్కువ అని రేవంత్ ను సర్వే ప్రశ్నించారు.



Next Story

Most Viewed