మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మా రెడ్డి గెలుపు ఖాయం

by Disha Web Desk 15 |
మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మా రెడ్డి గెలుపు ఖాయం
X

దిశ, అల్వాల్ : అధికారంలో ఉన్నప్పుడు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన పార్టీగా బీఆర్ఎస్ ను నగర ప్రజలు ఆదరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అదే ఫలితం పార్లమెంట్ ఎన్నికలలో సైతం వస్తుందని శనివారం కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏవిధంగా లక్ష్మారెడ్డి గెలుపొందుతాడో కార్యకర్తలకు నాయకులకు వివరించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారని, దానితో పాటు కార్పొరేటర్లు దానికి తోడు సంక్షేమ పథకాలు అనుభవించిన ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో

అందులో ఒక్కటి తప్ప అన్నీ ఉత్తవేనని, గడిచిన నాలుగు నెలల కాలంలో ప్రజలకు తెలిసి పోయిందన్నారు. పెంచుతానన్న పింఛన్ పెరుగలేదు కదా పాత పింఛిన్ రావడంలేదని వృద్ధులు ఎదురు చూస్తున్నారు అన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ చవిచూస్తుందన్నారు. మంచివాడు అందరికి అందుబాటులో ఉండేవాడు కార్మిక నేపధ్యం నుండి వచ్చిన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే మన మల్కాజిగిరి అభివృద్దికి మరింత చేయూతనందిస్తారని తెలిపారు. అంతేకాకుండా రైల్వే చక్రబంధంలో ఉన్న సమస్యలు తీరాలంటే మర్రి లక్ష్మా రెడ్డి గెలుపు తప్పని సరి అన్నారు. ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన మంచి పనులు చెప్పడంతో పాటు గెలుస్తే చేపట్టే పనులు సైతం ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed