బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం : ఈటల

by Disha Web Desk 23 |
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం :  ఈటల
X

దిశ,మల్కాజిగిరి : బీజేపీ ద్వారనే దేశాభివృద్ధి సాధ్యమైతుందని మల్కాజిగిరి బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్, యాప్రాల్ లోని పలు కాలనీల్లో నిర్వహించిన ప్రచారంలో ఈటల పాల్గొని బీజేపీని బలపర్చాలని అభ్యర్థించారు. పదేళ్ళ బీజేపీ పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరిగి మోదీ నాయకత్వాన్ని గెలిపించాలని కోరారు. ఆనంతరం దుర్గాపురం బుడగ జంగాల బస్తీ వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

అనాదిగా ఆదరణకు నోచుకోక, ఎన్ని బాధలున్నా దిగమింగుకుని కుటుంబ బాధ్యతలు చేసుకునే బుడగ జంగాల వర్గానికి కుల సర్టిఫికేట్లకు, రేషన్ కార్డులు లేకుండా ఉంటే తన హయాంలోనే కొన్ని వర్గాలకు రేషన్ కార్డులకు, కుల సర్టిఫికేట్ల, ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో కొందరికి బ్యాంకుల నుండి రిబేటులో రుణాలు ఇప్పించమని తెలిపారు. కరోనా కష్ట కాలంలో తాను చేసిన పనిని గుర్తించిన ప్రజలు నేడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశానో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పని చేశానో గుర్తించాలని ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు సన్న బియ్యం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Next Story