- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హస్తం నేతల డిష్యుం డిష్యుం.. ఎంపీ అభ్యర్థి ముందు గొడవ పడిన కాంగ్రెస్ నాయకులు
దిశ,కూకట్పల్లి : పార్లమెంట్ ఎన్నికల వేళ ఆయా నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం, పార్టీ బలోపేతం కోసం ఫైవ్ మెన్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. పార్టీ ఆదేశాల మేరకు కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జి బండి రమేష్ నేతృత్వంలో ఫైవ్మెన్ కమిటీ ఏర్పాటు చర్యలు ప్రారంభించారు. అందరికీ ప్రతినిధ్యం ఇవ్వలేమని నిర్ణయించి ఫైవ్ మెన్ కమిటీ కాస్త నైన్ మెన్ కమిటీ గా మారింది. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, ఆయా డివిజన్ల నుంచి గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓటమి పాలైన వారికి, మైనారిటీలు, సీమాంధ్ర ప్రాంత నాయకులకు సరియైన ప్రాధాన్యత కల్పించకపోవడంతో కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎంపీ అభ్యర్థికి మద్దతుగా అల్లాపూర్ డివిజన్లోని ఎస్డి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు.
కాగా సమావేశం కు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వలేదని, కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమికి పాలైన సీనియర్ నాయకుడు మోయిజ్ సభ వేదికపై ఇన్చార్జి బండి రమేష్ను నిలదీశాడు. ఈ క్రమంలో సమావేశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదు. కమిటీలలో సీనియర్లకు, కాంటెస్టేడ్ కార్పొరేటర్లకు సరియైన ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని నిలదీసినట్టు సమాచారం. మోయిజ్కు తోడుగా మూసాపేట్కు చెందిన మరో ఇద్దరు సీనియర్ నాయకులు కమిటీలలో తమకు చోటు కల్పించకపోవడం ఏంటని నిలదీశారు. వేదికపై గంట పాటు పెద్ద ఉద్రక్తత వాతావరణం నెలకొన్నట్టు పార్టీ శ్రేణులు తెలిపారు. నియోజకవర్గం ఇన్చార్జి వైఖరిని అక్కడ ఉన్న సీనియర్లు తప్పు పట్టారు. కమిటీలో తనకు నచ్చిన వారిని నియమించుకున్నారని, అదే విధంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరిని కమిటీలో తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయనే చెప్పవచ్చు. ఉదయం కేపీహెచ్బీ కాలనీ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సునీత మహేందర్ రెడ్డి పాల్గొనగా నియోజకవర్గం ఇన్చార్జి ప్రచారంలో గైర్హాజరు అయ్యారు.