ఇంటర్ ఫలితాల్లో 'చిన్మయ' విజయ దుందుభి..

by Disha Web Desk 23 |
ఇంటర్ ఫలితాల్లో చిన్మయ విజయ దుందుభి..
X

దిశ,ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీలోని చిన్మయ జూనియర్ కళాశాల, అకాడమీ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఈ మేరకు గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల చైర్మన్ కల్లూరి లక్ష్మీ ప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు ఈగ విద్యాసాగర్, కెమిడీ భువన కృతి 467/470 మార్కులు సాధించి రాష్ట్రంలో రెండో ర్యాంక్ కైవసం చేసుకోగా, షేక్ జావిద్, మౌర్య, నోముల అక్షయ, బొడిగం మాన్వితలు 466/470 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారని తెలిపారు.

అదేవిధంగా ఇంటర్ రెండవ సంవత్సరం బైపీసీ విద్యార్థిని సోమ్ నికిత 989/1000 మార్కులు సాధించగా, కురిమిండ్ల శ్రీవల్లిక 986/1000 మార్కులు సాధించినట్లు తెలిపారు. మొత్తంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 90 శాతం, రెండవ సంవత్సరం 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. కళాశాలలో విశాలమైన గదులతో పాటు ఆధునిక ప్రయోగశాలలు ఏర్పాటు చేశామని, విద్యార్థులకు విద్యతో పాటు మెడిటేషన్, వివిధ కార్యక్రమాలతో మానసికంగా దృఢంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన వారికి లాప్‌టాప్ లు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల డీన్ లు డి. రామకృష్ణ, శ్రావణ్, ప్రిన్సిపాల్ రజనీకాంత్, లావణ్య, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed