మల్కాజిగిరిలో బీజేపీదే విజయం : ఈటల రాజేందర్

by Disha Web Desk 23 |
మల్కాజిగిరిలో బీజేపీదే విజయం :  ఈటల రాజేందర్
X

దిశ, ఘట్కేసర్ : మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఉదయం ఈటల నివాసంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వి. హనుమాన్, జిల్లా అధ్యక్షుడు పి. విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌండిన్య సంఘం నాయకులు బండ్ల గూడెం కిషోర్, కార్యదర్శి బి గూడెం పాండు, ఆర్యవైశ్య సంఘం నాయకులు బెల్లిద శ్రీనివాస్, శరత్, కరుణాకర్ యాదవ్, రవ్వ , హన్నంతు గౌడ్, కందకట్ల ప్రతాప్ రెడ్డి ఈటల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి బీజేపీ జెండా కప్పి ఈటల పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు గడపగడపకు తిరుగుతూ బీజేపీకి ఓటేసేలా ఓటర్లను అభ్యర్థించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్లె మధు, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, మేడ బోయిన నరేష్, వేముల వీరేశం, పల్లె శివ, విక్రాంత్ రెడ్డి, లంబ పవన్, గుండ్ల సిద్ధార్థ, బట్టి పవన్ , కె. ఉదయ్ , కె. రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed