బండి సంజయ్‌పై మేడిపల్లి పీఎస్‌లో కేసు నమోదు

by Disha Web Desk 23 |
బండి సంజయ్‌పై మేడిపల్లి పీఎస్‌లో కేసు నమోదు
X

దిశ, మేడిపల్లి : బీజేపీ నేత బండి సంజయ్ తో పాటు మరి కొందరి పై రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. సీఐ గోవింద రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం చెంగిచెర్ల లో రెండు వర్గాల మధ్య తగాదాలో ఓ వర్గం బాధితులను పరామర్శించడానికి పెద్ద ఎత్తున చెంగిచర్ల చేరుకున్న బీజేపీ నేత బండి సంజయ్, బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరుగగా ఇద్దరు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడమే కాకుండా, ఇద్దరు పోలీస్ సిబ్బందికి గాయలవడానికి కారణమయ్యారని, విధి నిర్వహణలో ఉన్న నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి, ఓ మహిళా కానిస్టేబుల్ తమకు గాయాలు అవ్వడానికి కారణమయ్యారని బండి సంజయ్, ఘట్కేసర్ ఏం పీ పీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తో పాటు పలువురు బీజేపీ నాయకులపై పిర్యాదు చేయడంతో సెక్షన్ 332, 253, 354, 149 ల కింద పలువురి ఫై కేసు నమోదు చేసామని సీఐ తెలిపారు.


Next Story

Most Viewed