- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నా జీవితం ప్రజాసేవకే అంకితం : ఎంపీ అభ్యర్థి నీలం మధు
దిశ,పటాన్ చెరు : తన జీవితం ప్రజాసేవకే అంకితమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తన తల్లిదండ్రులు కీర్తిశేషులు నీలం రాధ- నిర్మల్ సమాధుల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
పేదింటి బిడ్డని అయిన తనకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. మీ ఇంటి బిడ్డనైన నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే ఇందిరమ్మ స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో మెదక్ పట్టణానికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో గుమ్మడి దళ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి భారీ కాన్వాయ్ తో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు.