- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీరాముని దయతో మెదక్ ప్రజల ఆశీర్వాదం నా మీద ఉండాలి
దిశ, తూప్రాన్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని శ్రీరామచంద్రుడు సుఖ సంతోషాలతో ఏలోటు లేకుండా కొనసాగేటట్లు దీవించాలని శ్రీరాముని ప్రార్థించానని మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తెలిపారు. తూప్రాల్లో రామాలయం వద్ద జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీరాముని, మెదక్ ప్రజల దయ తన మీద ఉండాలని, తాను ఎంపీగా భారీ మెజారిటీతో గెలవాలని దేవుని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలలో ఐదు పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ పాలన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. సీతారామచంద్రస్వామిని దర్శించుకుని అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, ఆంక్షరెడ్డి, మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, ఆలయ చైర్మన్ బజారు రవీందర్, వేద పండితులు ఉదయ్ కుమార్ శర్మ, కౌన్సిలర్లు జ్యోతి రవీందర్, నారాయణ గుప్తా, నాయకులు రేపల్లె శంకర్, గుమ్మడి శ్రీనివాస్ కుమార్, భాగ్యరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.