బాకీ డబ్బుల కోసం బాలుడి కిడ్నాప్

by Disha Web Desk 11 |
బాకీ డబ్బుల కోసం బాలుడి కిడ్నాప్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బాకీ పడ్డ డబ్బుల కోసం బాలుడిని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపిన వివరాల ప్రకారం...బీహార్ కు చెందిన తబ్రీజ్ ఆలం వద్ద బీహార్ కు చెందిన అనూప్ చౌదరి 8 నెలల క్రితం పనిచేశాడు. ఈ క్రమంలో తబ్రీజ్ ఆలం అనూప్ చౌదరికి కొంత డబ్బులు బాకీ పడ్డారు. బాకీ డబ్బులు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా తబ్రీజ్ ఆలం పట్టించుకోక పోవడంతో అనూప్ చౌదరి, చందన్ కుమార్ దాస్, మేఘనాథ్ కర్మాకర్ లు కిడ్నాప్ కు పథకం రచించారు. కర్కపట్ల ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తబ్రీజ్ ఆలం కుమారుడు తావిద్ ఆలంను కిడ్నాప్ చేశారు.

బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టు ప్రక్కల విచారించగా గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు కొనిస్తామని తావిద్ ఆలంను తీసుకెళ్లినట్లు తెలిపారు. తబ్రీజ్ ఆలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మర్కుక్ ఎస్ ఐ మధుకర్ రెడ్డి సీసీ పుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి బాలుడుని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా బాలుడి తండ్రికి కిడ్నాపర్లు ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మర్కుక్ ఎస్ఐ, గజ్వేల్ రూరల్ సీఐ ఆధ్వర్యంలో టీంగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, రైల్వే పోలీసు సహకారంతో సాంకేతిక ఆధారాల ద్వారా నింధితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. కిడ్నాప్ కేసును మూడు గంటల్లో ఛేదించిన గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, మర్కుక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి కానిస్టేబుల్స్ నరసింహ, సాయి, రాజిరెడ్డి లను సీపీ అనురాధ అభినందించి నగదు రివార్డు అందజేశారు.

Next Story

Most Viewed