మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

by Disha Web Desk 15 |
మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
X

దిశ,పటాన్ చెరు : మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ శుక్రవారం పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన మాజీ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అవినాష్ గౌడ్ ఇంటికి వెళ్లిన నీలం మధుని ఆయన సన్మానించారు. పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని అవినాష్ గౌడ్ ని ఈ సందర్భంగా నీలం మధు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన అవినాష్ గౌడ్ పార్టీ గెలుపు కోసం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ నిబద్ధతతో పనిచేస్తానని వెల్లడించారు.

Next Story

Most Viewed