ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి

by Naresh N |
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి
X

దిశ, నంగునూరు: ఈనెల 28 నుంచి నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం మండల కేంద్రమైన నంగునూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి కిషన్ తెలిపారు. ఈ పరీక్షల రాసే ప్రథమ సంవత్సరం విద్యార్థులు నంగునూరు నుంచి 68, అక్కినపల్లి మోడల్ స్కూల్ నుంచి 84, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నర్మెట నుంచి 16 ,మొత్తం 168 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరంలో నంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 70 మంది, అక్కినపల్లి మోడల్ స్కూల్ నుంచి 75 మంది విద్యార్థులు మొత్తం 145 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో ఉదయం 8 గంటల లోపు పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.



Next Story

Most Viewed