బీఆర్ఎస్ ప్రచార రథానికి చెప్పుల దండ

by Disha Web Desk 15 |
బీఆర్ఎస్ ప్రచార రథానికి చెప్పుల దండ
X

దిశ, మిరుదొడ్డి : మెదక్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి, సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రచార రథానికి సొంత పార్టీ కార్యకర్త, 78వ బూత్ అధ్యక్షుడు రంగనమైన యాదగిరి తన కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.

వెంకటరామిరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్న సమయంలో తాము గత 50 సంవత్సరాలుగా మోతే శివారులో కబ్జాలో ఉన్న సర్వే నంబర్ 590 లోని 1.20 గుంటల భూమిని పక్కనే ఉన్న వెంకట్రామిరెడ్డి బంధువుల పేరిట నమోదు చేసి ప్రొసీడింగ్ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండి ఇప్పటివరకు కూడా న్యాయం జరగకపోవడంతో ఈ విధంగా నిరసన తెలిపినట్లు బాధితులు పేర్కొన్నారు.


Next Story

Most Viewed