BREAKING: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీ

by Satheesh |   ( Updated:2024-07-10 13:36:28.0  )
BREAKING: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు జరిగాయి. తాజాగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్.. హోంగార్డులు, ఆర్గనేజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా.. గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర.. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్.. టీజీపీఎస్సీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్.. రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు.. ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి.. మల్టీజోన్ 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి.. రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కే.రమేష్ నాయుడు.. మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి.. వనపర్తి ఎస్పీగా ఆర్. గిరిధర్.. హైదరాబాద్ తూర్పు మండల డీసీపీగా బాలస్వామి.. హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీగా చంద్రమోహన్.. సీఏఆర్‌హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తిలను ప్రభుత్వం నియమించింది. కాగా, ఇంతకుముందే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్‌ను ప్రభుత్వం తెలంగాణ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు వెలువడిన నిమిషాల్లోనే పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు జరగడం గమనార్హం.

Advertisement

Next Story