ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలు.. మహిళా కాంగ్రెస్ తీర్మానం

by Disha Web Desk 12 |
ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలు.. మహిళా కాంగ్రెస్ తీర్మానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరవేయడంలో మహిళా కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషించాలని అధ్యక్షురాలు సునీతా రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.హైదరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రతి గడప ని టచ్ చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్ద పీట వేసిందని , సీట్ల కేటాయింపులోనూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయన్నారు.

Next Story

Most Viewed