- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Post Office Rs 399 Insurance Scheme : పోస్టాఫీస్ ఖాతాతో రూ. 10 లక్షల ప్రమాద బీమా..
దిశ, గోపాలపేట: పోస్టాఫీస్ ఖాతాతో 369 ప్రీమియం చేస్తే రూ. 10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చని ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీస్ అధికారి అభిన్ శర్మ అన్నారు. బుధవారం గోపాలపేట మండల కేంద్రంలోని పోస్టాఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రమాద బీమా శిబిరంలో ముఖ్య అతిథిగా శర్మ పాల్గొని మాట్లాడారు. కార్మికులు గానీ వివిధ కులవృత్తులు వారు గానీ పోస్టాఫీస్ లో ఖాతా తెరుచుకుని రూ. 396 తో ప్రీమియం చేస్తే ప్రమాదవశాత్తు మృతి చెందిన ఖాతాదారునికి ఖాతాదారుని నామినికి రూ. 10 లక్షల బీమా లభిస్తుందని అన్నారు. ఈ భీమాకు పాము కాటుతో గానీ, కరెంట్ షాక్ తో గానీ, యాక్సిడెంట్లు గానీ, భవన నిర్మాణాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి ఈ బీమా వర్తిస్తుందని తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తులో ఖాతాదారుని ఆసుపత్రిలో చికిత్స కోసం 60 వేల రూపాయలు వెంటనే అందిస్తుందని తెలిపారు.
అదేవిధంగా ఆస్పత్రి ఖర్చు కోసం రోజుకు వెయ్యి చొప్పున పదివేల రూపాయలు అందించగలుగుతుందన్నారు. తమ పిల్లల చదువు కోసం లక్ష రూపాయల వరకు కేటాయిస్తుందని తెలిపారు. ముఖ్యంగా బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీవారు ఈ బీమా కంపెనీలో పోస్టాఫీస్ కు అనుసంధానంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ బీమా చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఖాతాదారుని నామిని పిల్లలకు ఉపయోగపడుతుందని తెలిపారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో బజాజ్ ఇన్సూరెన్స్ సేల్స్ అధికారిని లావణ్య, ఐపీపీ అధికారులు చైతన్య పోస్ట్ మాస్టర్ రామానంద సిబ్బంది విష్ణు వర్ధన్ గౌడ్, మసూద్ రామకృష్ణ, ఎంఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.