అశేష జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేసిన వంశీ చంద్ రెడ్డి

by Disha Web Desk 11 |
అశేష జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేసిన  వంశీ చంద్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి శుక్రవారం తన నామినేషన్ ను అట్టహాసంగా దాఖలు చేశారు. వంశీ చందర్ రెడ్డి దంపతులు, పార్టీ ముఖ్య నేతలు మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పర్ణిక రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహబూ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ అనంతరం ఊరేగింపుగా కలెక్టరేట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులతో కలిసి తన నామినేషన్ ను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Next Story

Most Viewed