ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్.. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం

by Disha Web Desk 23 |
ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్.. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం
X

దిశ , మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్ లో 99.86% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను అధికారులు 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లలో 1439 కి మందికి గాను 99.86%తో 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట, నాగర్ కర్నూల్ పోలింగ్ కేంద్రాలలో ఇద్దరు ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించు కోలేకపోయారు. మహబూబ్ నగర్ లో 245, వనపర్తి లో 218, గద్వాలలో 225 , కొల్లాపూర్ లో 67, అచ్చంపేటలో 79, కల్వకుర్తిలో 72 మంది, షాద్నగర్ లో 171, కోడంగల్ లో 56 మంది ఓటర్లు అందరూ (100%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూల్ లో 101 మందికి 100 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్కరు, నారాయణపేటలో 205 మందికి 204 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్కరు ఓటును వినియోగించుకోలేదు. కాగా కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని బట్టి గెలుపు పట్ల కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.


Next Story

Most Viewed