చరిత్రని వక్రీకరించి తీసిన రజాకార్ సినిమాని నిషేదించాలి

by Disha Web Desk 22 |
చరిత్రని వక్రీకరించి తీసిన రజాకార్ సినిమాని నిషేదించాలి
X

దిశ, గద్వాల: నిజం నియంతృత్వానికి, వెట్టి చాకిరి విముక్తి కై కమ్యూనిస్టులు (సీపీఐ పార్టీ) నడిపిన మహోత్తర వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేడు వక్రీకరించి మతాలను రెచ్చగొట్టే విధంగా ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జోగులాంబ గద్వాల జిల్లా సమితి ఆరోపించింది. రజాకార్ సినిమాను వెంటనే నిషేదించాలని తీసిన, తీయించిన వారి‌ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని‌ సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు మాట్లాడుతూ...‌ తెలంగాణలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో సాగుతున్న దోపిడీ దౌర్జన్యాలకు వెట్టి చారికి దొర బాంచన్‌నీ కాళ్ళు మొక్కుతా అనే దుర్మార్గలకు అణిచివేతకు అలాగే భూమి కోసం భుక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వ‌న సాగిన మొహోత్తర సయుధ పోరాటంలో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా పాల్గొని నిజాములను రక్త తర్పణంతో తరిమికొట్టారని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి,10వేల గ్రామాలను విముక్తి చేశారని అన్నారు.

అలాంటి పోరాటాన్ని నేడు రజాకార్ సినిమా పేరు మీద బీజేపీ కనుసన్నుల్లో హిందువులకు, ముస్లింలకు యుద్ధంగా పేర్కొనడం సమాజంలో అశాంతిని నెలకొల్పడమే వారి ఉద్దేశంగా కనపడుతుందన్నారు. బీజేపీ రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని, సినిమాని నిషేదించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే హిందువులు, ముస్లింలు ఎవరు కూడా రెచ్చిపోకుండా ఇది ఎన్నికల రాజకీయ కుట్రగా భావించి మతోన్మాద పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పెరు కృష్ణ, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్, సీపీఐ మండల ఇంచార్జి సుంకులమ్మ మెట్టు మహేష్, నాయకులు ప్రకాష్, ఏఐటీయూసీ నాయకులు నాగరాజు, పచ్చర్ల మురళి, ఎఐఎస్‌ఎఫ్ నరేష్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed