సవతి తల్లిపై పోరాడాల్సిందే.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 4 |
సవతి తల్లిపై పోరాడాల్సిందే.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గురువారం హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ యత్నిస్తోందన్నారు. చిన్న పనుల కోసం కేంద్రంపై మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయితే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కేంద్రంలో ఉన్న సవతితల్లిపై పోరాడాల్సి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులామ్ గిరీ చేస్తు్న్నారని సీరియస్ అయ్యారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని తొలగించాలని మోడీ ప్రభుత్వం కుట్ర జరుగుతోందన్నారు. బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ కు లేదన్నారు.

Next Story

Most Viewed