- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ఎఫెక్ట్...ఆక్రమణ వాస్తవమే
దిశ, ఖమ్మం రూరల్ : దిశ దినపత్రికలో ఎన్నెస్పీ కాలువ కబ్జా..? కబ్జాదారుల్లో కంగారు.. అనే వరుస శీర్షికలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. దిశ కథనాలకు స్సందించిన రూరల్ తహసీల్దార్ పి. రాంప్రసాద్ మంగళవారం రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారులు కలిసి సర్వే చేసి హద్దులు గుర్తించి రాళ్లను పాతించారు. మొత్తం 1.13 కుంటల ఎన్నెస్పీ భూమి తేలగా అందులో 5 కుంటల భూమిని పంచాయతీ భవనానికి, 35 కుంటలు ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు
ఇవ్వగా మిగిలిన 13 కుంటల భూమికి హద్దులు గుర్తించిరాళ్లను పాతించినట్లు తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. రైతులకు 34 కుంటల భూమి ఉందని, వారు దానిలో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుకోవాలని, హద్దులు గుర్తించిన భూమిలో ఎటువంటి క్రయవిక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్వేయర్ సతీష్రెడ్డి, ఆర్ఐ ప్రసాద్, వీఆర్ఏలు ఉన్నారు.