మన తెలంగాణలో చేపలు పట్టేవారు లేరా ..?

by Disha Web Desk 20 |
మన తెలంగాణలో చేపలు పట్టేవారు లేరా ..?
X

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలో కాకతీయ కాలంనాటి 1000 ఎకరాల విస్తీర్ణం గల ప్రధాన తుమ్మలచెరువు ఫిషరీస్ సొసైటీలో గిరిజన, ముదిరాజ్ పుత్రులు మాత్రమే ఉండాల్సి ఉంది. ఎన్నోఏళ్లక్రితం నెల్లిపాక బంజర, దుమ్ముగూడెం గ్రామాలకు చెందిన పాతకాలం నాటి సొసైటీని ఇప్పటికి మండల పరిధిలో గల ఆనందపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, బుర్గంపహాడు మండలానికి చెందిన ఓ రిటైడు ఉపాధ్యాయ ఉద్యోగి ఆంధ్రా కాంట్రాక్టర్ లకు కట్టపెట్టి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని తుమ్మల చెరువు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తుమ్మలచెరువులోని చేపలు వివిధ రాష్ట్రాలకు కంటైనర్ల ద్వారా సరఫరా చేసిన తరువాతనే తుమ్మల చెరువు ఆయకట్టు రైతులకు మిగిలిన చిన్న, చిన్న చేపలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తుమ్మల చెరువు పరిధిలోగల గిరిజనులు, ముదిరాజ్ పుత్రులను ప్రతి సంత్సరం వారికి వలలు, మేత విసిరే, పడవలు నడిపే, మెళకువలు నేర్పిస్తారు. వాటి ఖర్చులకు ఫిషరీస్ సంస్థ నుండి చెల్లిస్తామని తెలిపారు. అలాగే చెరువులో చేపలు పెంచటానికి కూడా పాల్వంచ దగ్గరలో గల కిన్నెరసాని ఫిషరీస్ సంస్థ వారే చేప పిల్లలు సరఫరా చేశారు. ఈ నిబంధనలు ఏవి ఈయనకు వర్తించవు. ఈ రిటైడు ఉపాధ్యాయ ఉద్యోగి ఆంధ్రాకాంట్రాక్టర్ లకు, చేపలుపట్టేవారికి ధారా ధారాదత్తం చేస్తున్నాడు. ఆయకట్టు రైతుల పై కూడా ఈ ఆంధ్రా కాంట్రాక్టర్లే పెత్తనం చెలాయిస్తున్నారు. అశ్వాపురం మండలానికి గిరిజనులు, ముదిరాజ్ పుత్రులకు చెందాల్సిన లాభాలను ఆంధ్రవారికి కట్టబెడుతూ వీరికి అన్యాయం చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్త్తం చేస్తున్నారు. ఈ రిటైడు ఉపాధ్యాయ ఉద్యోగిపై అధికారులు, ప్రజాప్రతినినిధులు, రాజకీయ నాయకులు ఏ ఒక్కరు కూడా చెర్యలు తీసుకోక పోవడం పై పలుఅనుమానాలకు తావిస్తున్నాయి. పోలీస్ లు కూడా ఆ సంపద కొల్లగొట్టేవారికి ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆగ్రహిస్తున్నారు.



Next Story

Most Viewed