కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్.. గులాబీమయమైన తెలంగాణ భవన్ (వీడియో)

by Disha Web Desk 19 |
కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్.. గులాబీమయమైన తెలంగాణ భవన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, బస్సు యాత్రకు గులాబీ బాస్ బయలుదేరారు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా తెలంగాణ భవన్ బీఆర్ఎస్ శ్రేణులతో గులాబీమయమైంది. హైదరాబాద్‌లోని తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్ మీదుగా కేసీఆర్ మిర్యాలగూడ చేరుకోనున్నారు. ఇవాళ మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొంటారు. కాగా, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు (బుధవారం) నుంచి మే 10 వరకు మొత్తం 17 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సు యాత్ర సాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, ఆదిలాబాద్ స్థానాలు మినహా.. మిగిలిన 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర చేయనున్నారు. మే 10న ఈ యాత్ర ముగియనుండగా.. అదేరోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed