ఖమ్మంపల్లిలో మట్టి మాఫియా.. ఎర్ర మట్టి గుట్టలు మాయం

by Disha Web Desk 23 |
ఖమ్మంపల్లిలో మట్టి మాఫియా.. ఎర్ర మట్టి గుట్టలు మాయం
X

దిశ,ముత్తారం: మండలంలోని ఖమ్మంపల్లి లో ఎర్ర మట్టి గుట్టలను కొంతమంది మాయం చేస్తున్నారు. గ్రామంలోని ఫారెస్ట్ భూముల్లో గల ఎర్రమట్టి గుట్టలను గుర్తించిన వారు ఇరువై రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జేసీబీతో తవ్వుతూ లారీల్లో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతే కాకుండా రెండు రోజుల నుంచి ఫారెస్ట్ ను అనుకొని ఉన్న గుట్టలను మిషన్స్ తో రాత్రి సమయంలో గుట్టుగా బెందడి, కంకర తవ్వుతూ రాళ్లను తరలిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కోట్లాది రూపాయల మైనింగ్ మినరల్ మింగుతున్న అక్రమార్కుల పై చర్యలు తీసుకోవడంపై ఆంతర్యం ఏంటని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Next Story

Most Viewed