ముందు 6 గ్యారంటీల అమలుకు గ్యారెంటీ ఇవ్వండి : భోగ శ్రావణి

by Disha Web Desk 23 |
ముందు 6 గ్యారంటీల అమలుకు గ్యారెంటీ ఇవ్వండి : భోగ శ్రావణి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఆరు గ్యారెంటీ ల సంగతి ఏమైంది అంటూ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భోగ శ్రావణి నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ని ప్రశ్నించారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రాగానే అన్నీ ఫ్రీ అని చెప్తారని మండిపడ్డారు. జీవన్ రెడ్డి అంకుల్ పెళ్లి కానుకగా ఆడపిల్లలకు ఇస్తానన్న తులం బంగారం గురించి ఇప్పుడు ఏం మాట్లాడతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులతో పాటు మహిళలను బీడీ కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు.

ముందు ఆరు గ్యారంటీ ల అమలు కు గ్యారెంటీ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. జీవన్ రెడ్డి కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించిన తర్వాతనే ఓట్లను అడగాలని సవాల్ విసిరారు. గతంలో ధర్మపురి నుండి అనేకసార్లు ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏ స్థాయిలో ఉండి అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారో ఈరోజు తాను కూడా అదే స్థాయిలో ఉండి మాట్లాడుతున్నానని, తప్పులు ఎత్తి చూపుతున్నానని చురకలు అంటించారు. రాజకీయాలలో ఉండాలంటే సీనియారిటీ మాత్రమే కాదు సిన్సియారిటీ కూడా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కార్యదర్శి మ్యాకల లక్ష్మి, ఉపాధ్యక్షులు పవన్ సింగ్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed