వ్యక్తి అదృశ్యం..

by Disha Web Desk 23 |
వ్యక్తి అదృశ్యం..
X

దిశ,జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్న పల్లి గ్రామానికి చెందిన కొలకాని రాజయ్య(46) అనే వ్యక్తి అదృశ్యం అయినట్లు జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజయ్య గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యం బారిన పడడంతో పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన మనసు బాగాలేదని తరచూ తన భార్య అయిన రజితతో చెప్పేవాడు. ఈ క్రమంలో ఈనెల 9వ, తేదీన తన మనసు బాగోలేదని రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. చుట్టుపక్కల వాళ్లతో పాటు బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ తన భర్త ఆచూకీ దొరకడం లేదని రాజయ్య భార్య రజిత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.


Next Story

Most Viewed