తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ...

by Disha Web Desk 23 |
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ...
X

దిశ,మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం... వెల్లుల్ల గ్రామానికి చెందిన బాధితురాలు పోచంపల్లి లక్ష్మి బంధువుల ఇంటికి పండుగ నిమిత్తం ఊరు వెళ్లగా గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందించారు. ఐదు తులాల బంగారం పదిహేను తులాల వెండి,42 వేల నగదు ఎత్తుకెళ్లి నట్లు తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed