తిరిగి బీజేపీలో చేసిన బీఆర్ఎస్ నాయకులు

by Disha Web Desk 12 |
తిరిగి బీజేపీలో చేసిన బీఆర్ఎస్ నాయకులు
X

దిశ, వేములవాడ: ఎంపీ ఎన్నికల వేళ కరీంనగర్ లో బీఆర్ పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్‌తో పాటు మరో సీనియర్ నాయకుడు గోపు బాలరాజ్‌లు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన ఇరువురికి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలోనే సుదీర్ఘ కాలం కొనసాగిన వీరిద్దరూ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంతగూటికి చేరడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



Next Story