బ్రేకింగ్: హైదరాబాద్‌లో రెండవ రోజు కొనసాగుతోన్న IT రైడ్స్..!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: హైదరాబాద్‌లో రెండవ రోజు కొనసాగుతోన్న IT రైడ్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండే నగరంలోని 40 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూజాకృష్ణ చిట్ ఫండ్స్‌ కంపెనీలో ఇవాళలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీ డైరెక్టర్ పూజ, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలో ముమ్మరంగా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కూకట్ పల్లిలోని ఇందుఫార్చూన్ కంపెనీలో కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఈ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

Next Story