అమానవీయ ఘటన.. మురికి కాలువలో పసికందు మృతదేహం

by Disha Web Desk 12 |
అమానవీయ ఘటన.. మురికి కాలువలో పసికందు మృతదేహం
X

దిశ, లింగంపేట్: లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం పసికందు మృతదేహం లభించినట్లు గ్రామస్తులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును తీసుకువచ్చి మురికి కాలువలో వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మురికి కాలువలో పసికందు మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మగ శిశువు మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed