- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజల సమస్యలు తీర్చితే ఆ కిక్కే వేరు.. మంత్రి కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రజల సమస్యలు తీర్చితే కలిగే ఆనందం.. మరెందులో రాదు అంటూ ఓ మీడియా చానెల్ తనపై ఇచ్చిన వార్తకు సంబందించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో హైదరాబాద్ అశోక్ నగర్ కు చెందిన ఓ మహిళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తమ కాలనీలో రోడ్డు తవ్వి వదిలేశారని, కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉందని, దయచేసి రోడ్డు పనులు వెంటనే చేయించాలని ఫోన్ లో సందేశం పంపించారు.
ఆ సందేశం చూసి స్పందించిన కోమటిరెడ్డి వారం రోజుల్లో పనులు పూర్తి అవుతాయని పీఏ ద్వారా సమాచారం అందించారని ఆ మహిళ చెబుతోంది. కానీ కేవలం నాలుగు రోజుల్లోనే రోడ్డు పనులు పూర్తి చేయించారని, తమ సమస్యపై వెంటనే స్పందించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. దీనికి సంబందించిన వీడియోను కోమటిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో షేర్ చూస్తూ.. ప్రజల సమస్యలు తీర్చితే కలిగే ఆనందం.. మరెందులో రాదు అంటూ రాసుకొచ్చారు.