- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్
దిశ,బేగంపేట: ద్విచక్రవాహనాలను దొంగిలిస్తూ వాటిపై రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టి చివరకు పోలీసులు చిక్కారు ఇద్దరు యువకులు. మంగళవారం బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తర మండలం డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరాలు వెల్లడించారు. చంద్రాయణగుట్ట కు చెందిన ఇబ్రహీం (13)తో పాటు మరో బాలుడు (17) ఇద్దరు కలిసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారు.
ఇటీవల బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ వాహనాలను దొంగిలించారు. ఇలా దొంగిలించిన వాహనాలకు నెంబర్ ప్లేట్స్ తీసివేసి రీల్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సీసీ పుటెజిలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఇద్దరు యువకులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసి విచారించారు.
దీంతో చేసిన దొంగతనాలను అంగీకరించారు. వీరి వద్ద నున్న 9 బైక్లను స్వాధీనం చేసుకున్న మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించి మరో యువకుడిని రిమాండ్ కు తరలించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వారు ఇంటిముందు ఉన్న వాహనాలు దొంగతనానికి గురి కాకుండా సెన్సార్స్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. ఈ సందర్భంగా అడ్మిన్ ఎస్సై గంగాధర్ ను క్రైమ్ సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, బేగంపేట సీఐ రామయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.