- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓవైసీ బ్రదర్స్ను జైలులో చంపాలనుకుంటున్నారు… అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
దిశ, చార్మినార్ : ఓవైసీ బ్రదర్స్ను జైలుకు తరలించి వైద్యం పేరిట చంపుదామనుకుంటున్నారని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రాయల్ క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తఖ్రీబ్ ఈద్ మిలాబ్ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. నాకు చావు ఏ రూపంలో వస్తుందో అర్థం కాకుండాఉందని, అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా జైలులో విషం ఇచ్చి చంపుదామని చూస్తున్నారన్నారు.
నన్ను అసదుద్దీన్ ఓవైసీని జైలుకు పంపించి అక్కడ వైద్యం పేరిట గన్తో కాల్చి చంపేయాలని చూస్తున్నారని, అయినా మేము ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ లో మేము చాలా బలంగా ఉన్నామని , అందుకే తమను ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా చివరికే గెలిచేది మేమే అని అక్బరుద్దీన్ఓవైసీ స్పష్టం చేశారు.