- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కల్వరీ టెంపుల్ లో కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు
దిశ, శేరిలింగంపల్లి : రానున్న ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఆదివారం శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మియాపూర్ లోని కల్వరీ టెంపుల్ లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ జగదీశ్వర్ గౌడ్ లు కల్వరీ టెంపుల్ లో బ్రదర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం: రంజిత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలోని అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో కాలనీ అసోసియేషన్ సభ్యులతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి మాటే లేకుండా పోయిందన్నారు. సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయని, కార్పొరేట్ శక్తుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇంఛార్జీ జగదీశ్వర్ గౌడ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.