మాదాపూర్, మియాపూర్ లలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు

by Disha Web Desk 11 |
మాదాపూర్, మియాపూర్ లలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గుట్టల బేగంపేట పరిధిలోని సర్వే నెంబర్ 69లోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించి, అందులో నిర్మాణాలు చేపట్టగా మంగళవారం వాటిని కూల్చివేశారు. అలాగే మియాపూర్ ప్రభుత్వ సర్వే నెంబర్ 28లో పలు నిర్మాణాలు చేపట్టగా అక్కడ సీఆర్పీఎఫ్ సిబ్బంది సహాయంతో నిర్మాణాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండలంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినా ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.


Next Story

Most Viewed