ఈ నెల 25వ తేదీ నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

by Disha Web Desk 11 |
ఈ నెల 25వ తేదీ నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణి తెలిపారు . ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఎస్ఎస్ సి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు.



Next Story

Most Viewed