మధుయాష్కి గౌడ్‌కు మాతృవియోగం..

by Disha Web Desk 23 |
మధుయాష్కి గౌడ్‌కు మాతృవియోగం..
X

దిశ,ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ , నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ ఈరోజు ఉదయం బంజారాహిల్స్ లోని ఇంట్లో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ,మాజీ మంత్రి రాజేశం గౌడ్ ,సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ,ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, సుధీర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు మాల్ రెడ్డి రామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొని మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హయత్ నగర్ లో అంత్యక్రియలు హయత్ నగర్ లోని రేడియో స్టేషన్ పక్కన ఉన్న మధుయాష్కి గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.


Next Story

Most Viewed