బస్టాండ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కిన వృద్ధురాలు ఏమైనట్టు

by Sridhar Babu |
బస్టాండ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కిన వృద్ధురాలు ఏమైనట్టు
X

దిశ, మలక్ పేట్ : బంధువుల ఇంటికని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వృద్ధురాలు కనిపించకుండా పోయిన సంఘటన మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మాదన్నపేట్ వినయ్ నగర్ ప్రాంతానికి చెందిన బుచ్చమ్మ (78) ఈ నెల 2 తేదీన మోయిన్ పేట్ లో నివాసం ఉండే బంధువుల ఇంటికి వెళ్లడానికి కూతురు రాజమణి ధోబి ఘాట్ వద్ద ఇమ్లిబన్ బస్టాండ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కించింది. సాయంత్రం ఐదున్నర గంటలకు మెయిన్ పేట్ లో నివాసం ఉండే సోదరుడు శివకుమార్ కు ఫోన్ చేసి ఆరా తీయగా రాలేదని తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఇమ్లిబన్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు 040-27854784 నెంబర్లలో సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Next Story