- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణ ప్రభుత్వం రంగులు పూస్తూ మభ్యపెడుతున్నది: కిషన్ రెడ్డి
దిశ, ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఖైరతాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, సీనియర్ నాయకులు పల్లపు గోవర్ధన్ పాదయాత్రలో పాల్గొని బంజారా హిల్స్, వెంకటేశ్వర కాలనీ డివిజన్లలో ప్రతి గల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు పరిష్కరించాలంటూ ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ చాలా అభివృద్ధి చెందింది అని.. మెయిన్ రోడ్లకు రంగులు పూస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బస్తీలల్లో ఎక్కడ చూసినా గుంతలతో రోడ్లు భయంకరంగా, డ్రైనేజ్, మంచినీటి సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఉచిత బియ్యం, పొదుపు సంఘాల రుణాలు ఇస్తుందని, మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 80 శాతం హైదరాబాద్ నుండే వస్తుంది.. అలాంటప్పుడు వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ నిధులు కొరత లేకుండా నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఒక డేటా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరాజ్, సితాల అనిల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.