రామయ్య పెళ్లికి సర్వం సిద్ధం

by Disha Web Desk 11 |
రామయ్య పెళ్లికి సర్వం సిద్ధం
X

దిశ, మెహిదీపట్నం : సీతారాముల కల్యాణానికి లంగర్ హౌస్ త్రివేణి సంగమ రామాలయం ముస్తాబయింది. జంట నగరాల్లోనే ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణం ఎంతో ప్రఖ్యాతి. ఏర్పాట్లను ఆలయ పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, ప్రత్యేకంగా స్టేజి, అదేవిధంగా సీతారాములకు సంబంధించిన ప్రతి ఘటాన్ని బొమ్మల రూపంలో తీర్చిదిద్దిన ఏర్పాట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సీతారాముల కళ్యాణం తర్వాత మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి

బుధవారం ఉదయం 10 గంటల నుంచి లంగర్ హౌస్ లోని రామ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా తెలిపారు. సీతారాముల కల్యాణానికి లంగర్ హౌస్ అత్తాపూర్ తర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. సుమారు 50 వేల మంది హాజరుకానున్నారు. అందుకు తగినట్లుగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు సీతారాముల కల్యాణానికి హాజరు కానున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Next Story