అల్వాల్‌లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత!

by Anjali |
అల్వాల్‌లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత!
X

దిశ, వెబ్‌‌డెస్క్: నిరుపేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా అల్వాల్‌లో ఇదే పద్ధతిలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 4000 కిలోల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకొని రెండు ఆటోలను సీజ్ చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో యాదాద్రి జిల్లా తిమ్మాపూర్ తండాకు చెందిన పాండు నాయక్ అనే వ్యక్తిపై గతంలో పీడీఎస్ రైస్‌కు సంబంధించిన కేసులు 13 ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తిపై పీడీ యాక్ట్ వేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story