భద్రాచలంలో పారామెడికల్ కాలేజీ వద్ద హైటెన్షన్!

by Rajesh |
భద్రాచలంలో పారామెడికల్ కాలేజీ వద్ద హైటెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలోని పారామెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిన్న ఉదయం అపస్మారక స్థితిలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్యను గుర్తించారు. కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న కారుణ్యను విద్యార్థులు గుర్తించారు. వెంటనే విద్యార్థిని కారుణ్యను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి కాలేజీ యాజమాన్యం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య మృతి చెందింది.

విద్యార్థిని మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు బంధువులు తరలివచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story