- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ డీజీపీకి హరీశ్ రావు రిక్వెస్ట్.. ఎందుకంటే?
by Ramesh Naini |
ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే, దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన కూడా రెస్పాండ్ కాలేదని ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాగా, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఇవాళ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రిక్వెస్ట్ చేశారు.
Next Story






