రైతులకు గుడ్ న్యూస్..రేపే అకౌంట్‌లో డబ్బులు జమ?

by Jakkula Mamatha |
రైతులకు గుడ్ న్యూస్..రేపే అకౌంట్‌లో డబ్బులు జమ?
X

దిశ,వెబ్‌డెస్క్: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు అకౌంట్‌లో ‘పీఎం కిసాన్’ డబ్బులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేసేందుకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 18వ తేదీన కేంద్ర ప్రభుత్వం 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20 వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోడీ బదిలీ చేస్తారు.

ఈ పథకం కింద ఏటా రూ.6 వేలను (3 విడతల్లో..రూ.2 వేల చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయం పై మోడీ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేపు నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతుల పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 43.52 లక్షల మంది అర్హులకు.. ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున సాయం అందనుంది.

Advertisement

Next Story