రేవంత్ రెడ్డి జిత్తులమారి నక్క.. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 4 |
రేవంత్ రెడ్డి జిత్తులమారి నక్క.. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిందే చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పదేళ్లలో బీజేపీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దేశం 25 సంవత్సరాలు వెనక్కిపోవడానికి బీజేపీ కారణమైందని ఆరోపించారు.

ప్రశ్నించే వాళ్ళను అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకో ఐదేళ్లు 80 కోట్ల పేదలకు ఫ్రీ రేషన్ అని చెప్పి దేశంలో పేదరికం ఉందని మోదీ ఒప్పుకున్నాడన్నారు. కుల మత ద్వేషాలు రెచ్చకొట్టే పార్టీలను తెలంగాణలో బొందపెట్టాలని పిలుపునిచ్చారు.18 సంవత్సరాలు దాటినా మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు ఆ హామీ గురించి ఆలోచన లేదన్నారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.

రేవంత్ రెడ్డి జిత్తులమారి నక్క అని.. జూబ్లీహిల్స్ సొసైటీ లో బ్లాక్ మెయిల్ చేసి అక్రమంగా సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. పాలమూరును వాడుకోవడం తప్ప ప్రజలకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదన్నారు. రేవంత్ రెడ్డి తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మోడీతో చీకటి ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో బలహీన అభ్యర్థులను రేవంత్ రెడ్డి పెట్టారన్నారు. 14 ఎంపీలు గెలిపిస్తే ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తా అని మళ్ళీ మోసం చేస్తున్నాడన్నారు.

కేసీఆర్ , బీఆర్ఎస్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి రాజకీయం లేదన్నారు. భారతదేశంలో మోడీతో కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆరే అన్నారు. 4 లక్షల సిమ్ కార్డులు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు. దానం నాగేందర్‌వి జీవితాంతం పార్టీ పిరాయింపులే అని సెటైర్లు వేశారు.


Next Story

Most Viewed