- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేవంత్ చరిత్ర అంతా తెలుసు.. వారంలో బండారం మొత్తం బయటపెడతా: ఎర్రబెల్లి
దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి పార్టీ విడిచి వెళ్లడంతో బీఆర్ఎస్కు పట్టుకున్న దరిద్రం వదిలిందని అన్నారు. వారం రోజుల్లో కడియం శ్రీహరి బండారం మొత్తం బయటపెడతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర అంతా తనకు తెలుసన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిదే గెలుపని.. తన సర్వేలు ఎప్పుడు తప్పు కాలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. కాగా, ఇటీవల కూతురితో కలిసి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కేటాయించినప్పటికీ ఆమె పార్టీకి రాజీనామా పోటీ నుండి తప్పుకున్నారు. అనంతరం కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో వరంగల్ ఎంపీ టికెట్ను కాంగ్రెస్ కడియం కావ్యకు ఇచ్చింది. పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ పోటీ నుండి తప్పుకుని మోసం చేసిన కడియం శ్రీహరి కూతురు కావ్యను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలని బీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారు. ఇక, బీఆర్ఎస్ తరుఫున పోటీ నుండి కావ్య తప్పుకోవడంతో డాక్టర్ సుధీర్కు గులాబీ బాస్ ఎంపీ టికెట్ ఇచ్చారు.