మా జీవితంలో అలా జరిగింది.. పిల్లల్ని కనకపోవడంపై వితికా షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 8 |
మా జీవితంలో అలా జరిగింది.. పిల్లల్ని కనకపోవడంపై వితికా షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న జంట వితికా షేర్, వరుణ్ సందేశ్. వీరు పలు సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే వితికా సింగ్‌కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

ఈ బ్యూటీ యూట్యూబ్‌లో సొంతంగా ఓ ఛానల్ ఓపెన్ చేసి, తన ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక వరుణ్ సందేశ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితికా షేర్ పిల్లల్ని కనడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. అసలు విషయంలోకి వెళితే..2016‌లో వరుణ్‌కు నాకు పెల్లైంది. పడ్డానండి ప్రేమలో అనే సినిమాతో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నాము. ఇక అమెరికా వెళ్లి సెటిల్ అయిపోవాలని అక్కడికి వెళ్లాం.. కొంత కాలం అక్కడే ఉన్నాం. 2018లో ప్రెగ్న్ అయ్యాను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.. వరుణ్ కూడా చాలా ఆనందపడ్డాడు.. ఈ విషయం ఫ్యామిలీతో కూడా పంచుకున్నాం. కానీ కొన్ని రోజులకే గర్భస్రావం అయ్యింది. తర్వాత ఇండియాకు వచ్చాక మళ్లీ ప్రెగ్రెంట్ అయ్యాను..కానీ మళ్లీ కొన్ని రోజులకే గర్భస్రావం అయ్యింది. అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని అన్నారు. మరోసారి అబార్షన్ చేసి గర్భసంచి క్లీన్ చేశారు.

ఈ ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మేము ఆ బాధలోనే ఉన్నాం. ఆ సమయంలోనే బిగ్ బాస్‌కు వెళ్లడం జరిగింది. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్స్ రావడం.. ఫైనాన్సియల్ గా సెటిల్ కావడం జరిగింది. పిల్లలను ఎవరు వద్దనుకుంటారు. ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తాము.. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను వారితో సరదాగా ఆడుకుంటాను..పిల్లల్ని కనకూడదు అని ఎవరైనా అనుకుంటారా కానీ నేను ఎక్కడికి వెళ్లినా పిల్లల్నెప్పుడు కంటారు అనే ప్రశ్నే ఎదురు అవుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వితికా షేర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed