- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'డీపీఈ గైడ్ లైన్ రద్దు చేయాలి'
దిశ, తాండూర్ : కేంద్ర ప్రభుత్వం డీపీఈ గైడ్ లైన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన బాట పట్టారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసిపీ, సీహెచ్పీ, గోలేటి హాస్పిటల్, సివిల్, ఏరియా వర్క్ షాప్ల్లో నాయకులు, కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెరుగైన 11వ వేజ్ బోర్డ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గనులు, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకు నాయకులు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, హెచ్ఎంఎస్ ఏరియా కార్యదర్శి శివారెడ్డి, సెంట్రల్ కార్యదర్శి రవీందర్, నాయకులు జగ్గయ్య శేషు, మారం శ్రీనివాస్, రహమాన్, కిరణ్ బాబు, రాజేష్, అశోక్, వెంకటేష్, పోశం, శ్రీనివాస్, రామన్న, నాగరాజు, నర్సయ్య, కృష్ణ, మోహన్, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.